Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో శాస్త్రవేత్తకు కేబినెట్ హోదా

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (11:01 IST)
ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్తలకు పదోన్నతిగా ఇచ్చే కేబినెట్‌ కార్యదర్శి పదవి త్రివేండ్రంలోని వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర కేబినెట్‌ కమిటీ సోమనాథ్‌ను కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ర్యాంక్‌కు ఎంపిక చేసింది. ఈ నియామకంతో సోమనాథ్‌ 16వ పేమాట్రిక్స్‌ స్థాయి నుంచి 17వ స్థాయికి అప్‌గ్రేడ్‌ అయ్యారు. 2020 జనవరి 1 నుంచి సోమనాథ్‌కు ఈ పదోన్నతి అమలులోకి రానుంది. 
 
ప్రస్తుత ఇస్రో ఛైర్మన్‌ కే.శివన్‌ గతంలో ఇదేస్థాయిలో ఉండి 2018 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2021 జనవరిలో శివన్‌ పదవీకాలం పూర్తికానుడడంతో తదుపరి ఇస్రో ఛైర్మన్‌ అయ్యే అవకాశం సోమనాథ్‌కు కలగనుంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌ఈ) పూర్వ విద్యార్థి అయిన సోమనాథ్‌ 1985లో ఇస్రోలో చేరారు. 
 
పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, రాకెట్ల అభివృద్ధిలో విశేష పరిశోధనలు చేశారు. 2015లో ఇస్రో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా సోమనాథ్‌ ఎంపికయ్యారు. 2018లో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గా ఉన్న శివన్‌ ఇస్రో ఛైర్మన్‌గా నియమితులు కావడంతో సోమనాథ్‌ ఆయన స్థానంలో వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments