Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగం.. ముహూర్తం రాత్రి 10.08 గంటలు

పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (15:12 IST)
పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహన నౌకను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగం జరుగనుంది. ఆదివారం (సెప్టెంబర్-16) రాత్రి పది గంటల 8 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ నౌకను నింగిలోకి ప్రవేశపెడతారు.
 
ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగమని.. దీని ద్వారా బ్రిటన్‌కు చెందిన 889 కిలోల బరువైన నోవాసర్, S1-A ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి సర్వే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ రూపకల్పన చేసింది. పీఎస్ఎల్వీ-సీ-42 ప్రయోగంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 
 
ఆదివారం రాత్రి 10.07కు ప్రయోగాన్ని నిర్వహించాలని మొదట నిర్ణయించినా వర్షం పడే అవకాశముండటంతో రాకెట్ వెళ్లే గమనంలోని అంతరిక్ష వ్యర్ధాలను తప్పించుకునేందుకు ఒక నిమిషం పొడిగించి ప్రయోగ సమయాన్ని 10.08గా నిర్ణయించారు. ఇక 33గంటల కౌంట్ డౌన్‌లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం రాత్రి రాకెట్‌ను నాలుగో దశలో ద్రవ ఇంధనం నింపి పరిశీలించారు. 
 
ఆదివారం తెల్లవారు జామున రెండో దశలో ద్రవ ఇందనం నింపే ప్రక్రియను పూర్తి చేశారు. ఇవాళ తుది విడత తనిఖీల తర్వాత పీఎస్ఎల్వీ-సీ-42 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments