ఇస్రో ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభం

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (13:08 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)ను మోడీ ప్రభుత్వం ప్రయివేటీకరిస్తోంది. ఇందుకోసం తొలుత పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ (పిఎస్‌ఎల్‌వి) తయారీ ప్రక్రియను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతరిక్ష పరిశోధనలను ఇస్రో స్వయంగా నిర్వహిస్తూ వస్తోంది.

కేంద్రం పిఎస్‌ఎల్‌వి తయారీ పనులను అతి త్వరలోనే కార్పొరేట్లకు అప్పగించనుంది. పిఎస్‌ఎల్‌వి తయారీ కాంట్రాక్టును పొందడానికి అదానీ గ్రూపు, ఎల్‌అండ్‌టి గ్రూపు లాంటి బడా కార్పొరేట్లు పోటీ పడుతున్నాయి.

ఈ రెండు సంస్థలు వేరు వేరు కన్సారియంలుగా ఏర్పాడి ఆసక్తి బిడ్లను దాఖలు చేశాయి. వీటితో పాటుగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(భెల్‌) ఏకైకా కంపెనీగా బిడ్స్‌ను దాఖలు చేసింది.

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా పిఎస్‌ఎల్‌వి కాంట్రాక్టును పొందడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఎల్‌అండ్‌టి సారధ్యంలోని కన్సార్టియంలో హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments