Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టి పాస్ మార్కులు వేయాలంటూ విద్యార్థి వేడుకోలు!!

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (17:40 IST)
ఓ విద్యార్థి పరీక్ష రాశాడు. కానీ, పరీక్ష ఫెయిల్ అవుతానని తెలుసుకున్న ఆ విద్యార్థి జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టి.. తనకు పాస్ మార్కులు వేయాలంటూ వేడుకున్నారు. ఈ విషయం బోర్డు పరీక్షా పేపర్ల మూల్యాంకన సమయంలో వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా వెల్లడించారు. ఆన్సర్ షీట్లను తెరిచినపుడు రూ.100, రూ.200, రూ.200 నోట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కవ్వాల్సి వచ్చిందని తెలిపారు. బుద్ధిగా చదివి మెరుగైన మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలన్న ఆలోచనకు బదులుగా లంచాలు ఇచ్చి పాస్ అయిపోదామన్న విద్యార్థుల విపరీత ధోరణి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై ఐపీఎస్ అధికారి బోత్రా స్పందిస్తూ "ఈ ఫోటోను ఓ టీచర్ పంపించాడు. బోర్డు పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ల మధ్య నోట్లను ఉంచినట్టు చెప్పారు. పాస్ మార్కులు వేయాలన్న అభ్యర్థన అక్కడ రాసివుంది. మన విద్యార్థులు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ గురించి ఇది తెలియజేస్తుంది" అని అరుణ్  బోత్రా తన స్పదనను వ్యక్తం చేసారు. ఈ పోస్ట్‌ను చూసిన కొందరు ఇదే తరహా అనుభవం తమకు కూడా ఎదురైందని మరికొందరు టీచర్లు ట్విట్టర్ వేదికగా స్పందిచారు. అడిగిన ప్రశ్నకు సమాధానానికి బదులు ఓ విషాద గాథను రాసి డబ్బులు ఉంచుతుండటం టీచర్లను ఆత్మరక్షణలో పడేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments