Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో భార్య సంసారానికి రాలేదు.. తొలి భార్య కొడుకును చంపేశాడు..

Webdunia
మంగళవారం, 16 మే 2023 (14:59 IST)
తొలి భార్యతో కలిగిన సంతానం విషయంలో రెండో భార్యతో గొడవలు జరగడంతో కన్నకుమారుడిని చంపేశాడు ఓ కిరాతకుడు. రెండో భార్య కాపురానికి రావట్లేదని ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఇండోర్ లోని తేజాజీ నగర్ ఏరియాలో ఉంటున్న శశిపాల్ ముండే (26) మొదటి భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. మొదటి భార్యకు, శశిపాల్ ముండేకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భార్య చనిపోవడంతో శశిపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్యతో శశిపాల్‌ కుదురుగా సంసారం చేయలేదు. 
 
తరచూ గొడవలు తప్పలేదు. ఈ క్రమంలో పిల్లాడిని తాను చూసుకోలేనని చెప్పి శశిపాల్ రెండో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక మొదటి భార్య కుమారుడు వున్నంత కాలం రెండో భార్య సంసారానికి రాదని తేల్చి చెప్పేయడంతో.. విసిగిపోయిన శశిపాల్ కన్న కొడుకును కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న శశిపాల్‌ను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments