Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్‌ యుద్ధ వీరుడి కన్నుమూత

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:38 IST)
భారత సైన్యంలో రెండో అత్యున్నత పురస్కారం మహావీర్‌ చక్ర గ్రహీత, కమొడోర్‌ కేపీ గోపాల్‌రావు(94) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. నౌకాదళ ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

చెన్నై, బసంత్‌నగర్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గోపాల్‌రావు 1926 నవంబరు 13న తమిళనాడు మదురైలో జన్మించారు. 1950 ఏప్రిల్‌ 21న భారత నౌకాదళంలో చేరారు. 1971 ఇండో-పాక్‌ యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఆయనకు మహావీర్‌ చక్ర పురస్కారం దక్కింది. యుద్ధ సమయంలో డిసెంబరు 4న ‘ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌’కు ఆయన్ను కమాండింగ్‌ అధికారిగా నియమించారు.

తన బృందంతో పాక్‌ జలాల్లోకి చేరుకొన్న గోపాల్‌రావు.. కరాచీ పోర్టుపై బాంబులతో దాడి చేశారు. హార్బర్‌లో ఉన్న ఆయిల్‌, ఇతర పరికరాలను నాశనం చేశారు. అప్పటి విజయానికి గుర్తుగానే ప్రస్తుతం డిసెంబరు 4న నేవీ డే నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments