Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (19:05 IST)
దేశంలో వేసవి కాలం ముగిసినప్పటికీ పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇండిగో విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలిగింది. గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండిగో విమానం 6ఈ 2521 ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా బయలుదేరేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం 2.30కు టేకాఫ్‌ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడమే అందుకు కారణంగా తెలుస్తుంది. దీంతో ప్లైట్‌ టేకాఫ్‌కు 2 గంటలు ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికులు విమానంలో కూర్చున్నారు. డోర్‌ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. ఏసీ పనిచేయకపోవడంతో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ ఘటనపై స్పందించిన ఇండిగో వివరణ ఇచ్చింది. 'బాగ్‌డోగ్రా వెళ్లే విమానంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. గమ్యస్థానానికి చేరుకునేందుకు చర్యలు జరుగుతున్నాయి' అని ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments