ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం : ప్రయాణికులను వదిలివెళ్లిన ఇండిగో విమానం

ఠాగూర్
సోమవారం, 25 ఆగస్టు 2025 (10:51 IST)
ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యంతో కొందరు ప్రయాణికులను విమానాశ్రయంలోనే ఓ విమానం వదిలి వెళ్లింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ముంబైకి, అక్కడి నుంచి డాలస్ వెళ్లాల్సిన కొందరు ప్రయాణికులను ఇక్కడే వదిలేసి విమానం వెళ్లిపోయింది. బాధిత ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ నుంచి డాలస్ వెళ్లాల్సిన 38 మంది టర్కిష్ ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్ సూచన మేరకు ఇండిగో ఎయిర్ లైన్స్ టై అప్ టికెట్లను ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. 
 
వీరు శంషాబాద్ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 11.40 గంటలకు ముంబై వరకు ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఇ-5195 విమానంలో, అక్కడి నుంచి టర్కిష్ ఎయిర్‌ లైన్స్ విమానంలో డాలస్‌కు వెళ్లాలి. 38 మంది ప్రయాణికులు శనివారం శంషాబాద్ విమానాశ్రయానికి సకాలంలో చేరుకుని ఎయిర్ లైన్స్ కేంద్రంలో సంప్రదించారు. 
 
ఓవర్ బుకింగ్ పేరుతో విమాన ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతినిధులు సర్వీస్ నంబరును 6ఇ-6132గా మార్చారని, అందులో 24 మందినే ఎక్కించుకుని ముంబైకి పంపించారని మిగతా ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై ఇండిగో ప్రతినిధులను నిలదీయగా పొంతనలేని సమాధానాలిచ్చారంటూ ఆందోళనకు దిగారు. దాదాపు ఏడు గంటలపాటు విమానాశ్రయంలోనే వేచిఉన్న అనంతరం వారు వెనుదిరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments