Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో కీలక మార్పు.. రైల్వే శాఖ నిర్ణయం

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (16:33 IST)
అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో భారతీయ రైల్వే కీలక మార్పు చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పు చేయడం గమనార్హం. ఇప్పటివరకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ 120 రోజులుగా ఉండేది. దీన్ని ఇపుడు సగానికి తగ్గించింది. అంటే 60 రోజులకు కుదించింది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉండేది. ఇకపై కాల పరిమితి 60 రోజులకే కుదించింది. 
 
ఈ కీలక నిర్ణయం నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే, నవంబర్ ఒకటో తేదీకి ముందు బుకింగ్ చేసుకునేవారికి కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావని తెలిపింది. 
 
తాజ్ ఎక్స్‌ప్రెస్, గౌమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యధాతథంగా కొనసాగుతుందని తెలిపింది. నిజానికి ఈ రైళ్లకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ సమయం తక్కువగా ఉంది. అదేసమయంలో విదేశీయులకు మాత్రం 365 రోజుల అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments