Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు వార్నింగ్ ఇచ్చిన ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌.. పాకిస్థాన్ కూడా ఆ పని?

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (20:26 IST)
Gen Naravane
భారత్-చైనా సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ, ఇద్దరు భారత జవాన్లు అమరులైనారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఎప్పటికప్పుడూ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు, సరిహద్దుల్లో ఆక్రమణలు, అక్రమంగా కట్టడాల నిర్మాణానికి ఎప్పటికప్పుడూ చైనా ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణె. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.
 
చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లఢాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో ఉంచేందుకు ఇటీవల సైనిక అధికారుల స్థాయి 14వ విడత చర్చలు కూడా జరిగాయన్నారు. 
 
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను ప్రోత్సహించేందుకు పాకిస్థాన్‌ ఇంకా ప్రయత్నాలు సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఎం నరవణె. బోర్డర్‌ దగ్గర కశ్మీర్​లోకి చొరబడేందుకు 300-400 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments