Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 గంటల వ్యవధిలో.. 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్.. ఆర్మీ అదుర్స్

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (23:04 IST)
రాజస్థాన్‌లో ఇండియన్ ఆర్మీ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కేవలం మూడు గంటల వ్యవధిలోనే 100 పడకల ఆక్సిజన్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లోని బార్మెల్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉన్న కస్తూర్బా గర్ల్స్ హైస్కూల్ లో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. జిల్లాలో కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. 
 
పైగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు ఇండియన్ ఆర్మీ సహాయం కోరారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ 40 మంది సైనికులను రంగంలోకి దించింది. 
 
కేవలం 3 గంటల వ్యవధిలో అంటే రాత్రి 12 గంటల వరకు 100 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్స్ సౌకర్యం కలిగిన ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా ఆసుపత్రిపై కొంతమేర ఒత్తిడి తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments