Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (09:54 IST)
భారతీయ రైల్వే శాఖ వేగవంతమైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇపుడు హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌లో బుల్లెట్ రైల్ కలను సాకారం చేసే దిశగా ఒక కార్యాచరణను రూపొందించనుంది. అన్నీ అనుకూలంగా సాగితే తొలి బుల్లెట్ రైల్ ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనుంది. ఇది 2027 నాటికి పట్టాలెక్కనుంది. 
 
జపాన్‌ రైల్వే శాఖ షింకాన్ సెన్ పేరిట ఎన్నో ఏళ్ళుగా అత్యంత సమర్థతతో బుల్లెట్ రైళ్లను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ హైస్పీడ్ రైళ్ళ గరిష్ట వేగం 320 కిలోమీటర్లు. ఇలాంటి బుల్లెట్ రైళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 షింకాన్ సెన్ రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తుంది. వాటి అంచనా వ్యయం రూ.11 వేల కోట్లు. ప్రధానంగా జపనీస్ సంస్థలనే బిడ్డింగ్‌కు కేంద్రం ఆహ్వానించనుంది. జపాన్ దేశానికి చెందిన ఈ సంస్థలకు షింకాన్ సెన్ రైళ్ల తయారీ, నిర్వహణలో అపారమైన అనుభవం ఉంది. అందుకే కేంద్రం ఈ తరహా చర్య తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments