Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య పరుగులు పెట్టనున్న తొలి బుల్లెట్ రైలు

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (09:54 IST)
భారతీయ రైల్వే శాఖ వేగవంతమైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇపుడు హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది భారత్‌లో బుల్లెట్ రైల్ కలను సాకారం చేసే దిశగా ఒక కార్యాచరణను రూపొందించనుంది. అన్నీ అనుకూలంగా సాగితే తొలి బుల్లెట్ రైల్ ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య పరుగులు పెట్టనుంది. ఇది 2027 నాటికి పట్టాలెక్కనుంది. 
 
జపాన్‌ రైల్వే శాఖ షింకాన్ సెన్ పేరిట ఎన్నో ఏళ్ళుగా అత్యంత సమర్థతతో బుల్లెట్ రైళ్లను నడుపుతున్న విషయం తెల్సిందే. ఈ హైస్పీడ్ రైళ్ళ గరిష్ట వేగం 320 కిలోమీటర్లు. ఇలాంటి బుల్లెట్ రైళ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. మొత్తం 24 షింకాన్ సెన్ రైళ్లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తుంది. వాటి అంచనా వ్యయం రూ.11 వేల కోట్లు. ప్రధానంగా జపనీస్ సంస్థలనే బిడ్డింగ్‌కు కేంద్రం ఆహ్వానించనుంది. జపాన్ దేశానికి చెందిన ఈ సంస్థలకు షింకాన్ సెన్ రైళ్ల తయారీ, నిర్వహణలో అపారమైన అనుభవం ఉంది. అందుకే కేంద్రం ఈ తరహా చర్య తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments