Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో సమీప భవిష్యత్‌లో యుద్ధం తప్పదా?.. దల్బీర్ సింగ్ ఏమన్నారు?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (09:02 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాలు సమరానికి కాలుదువ్వుతున్నాయా? అలాంటి పరిస్థితులు ఇరు దేశాల్లో నెలకొన్నాయా? అంటే భారత ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ మాత్రం అవుననే అంటున్నారు. నిజానికి భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో నిరంతరం ఓ మినీ యుద్ధమే సాగుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి పెరిగిన చొరబాట్ల కారణంగా సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. దీంతో భారత సైన్యం నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. 
 
ఈ పరిస్థితులపై ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ స్పందిస్తూ పాకిస్థాన్‌తో స్వల్పకాలిక, మెరుపు యుద్ధాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో 1965నాటి భారత్‌-పాక్‌ యుద్ధంపై నిర్వహించిన త్రివిధ దళాల కీలక సిబ్బంది సదస్సులో ఆయన పైవిధంగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల నిరంతర చొరబాటు యత్నాలు, వారికి దన్నుగా పాక్‌ కవ్వింపు కాల్పులు పెరిగాయన్నారు. ఈ పరిస్థితుల నడుమ భవిష్యత్ యుద్ధాలు హెచ్చరికలకు పెద్దగా వ్యవధి ఉండని, స్వల్పకాలిక, మెరుపుదాడుల రూపంలో ఉంటాయన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments