Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (15:32 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 
 
తొలుత తాత్కాలికంగా సేవలను నిలిపివేసి, ఆ తర్వాత భద్రతను సమీక్షించిన తర్వాత ఈ విమానం సేవలను పూర్తిగా నిలిపివేయాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా తాజాగా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిరిండియాతోపాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విమాన ప్రయాణికులు 241తో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన గగనతలంలో ప్రమాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినపుడు బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నమైనవనే అభిప్రాయం ఉంది. కానీ, అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఈ విమానాల భద్రతపై ఇపుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments