Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం : హర్షవర్థన్

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (08:36 IST)
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ దేశ ప్రజలకు ఓ శుభవార్త చెప్పార. వచ్చేనెలలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చేనెలలో ఏ దశలోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని, దేశ ప్రజలకు తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ షాట్‌ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉండాలన్నారు. అయితే వ్యాక్సిన్‌ భద్రత, సమర్థత తమ మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీపడే అవకాశమే లేదన్నారు. 
 
దేశంలో అత్యవసర వినియోగానికి కొన్ని వ్యాక్సిన్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటిని డ్రగ్‌ రెగ్యులేటర్‌ విశ్లేషిస్తున్నారని చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ పరిశోధనల విషయంలో భారత్‌ ఏ దేశానికి తీసిపోలేదన్నారు. 
 
టీకా సమర్థత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు స్వదేశీ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నారని, వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో దేశంలో 30 కోట్లమందికి టీకాలు వేసే సామర్థ్యం తమకుంటుందని చెప్పారు. 
 
ప్రస్తుతం మన దేశంలో ఆరు కరోనా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని చెప్పారు. అందులో కొవీషీల్డ్‌, కోవాక్సిన్‌, జింకోవిడ్‌, స్పుత్నిక్‌ వీ, ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 టీకాల పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments