Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం : హర్షవర్థన్

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (08:36 IST)
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్థన్ దేశ ప్రజలకు ఓ శుభవార్త చెప్పార. వచ్చేనెలలో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆ తర్వాత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, వచ్చేనెలలో ఏ దశలోనైనా, ఏ వారంలోనైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని, దేశ ప్రజలకు తొలి కొవిడ్‌ వ్యాక్సిన్‌ షాట్‌ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉండాలన్నారు. అయితే వ్యాక్సిన్‌ భద్రత, సమర్థత తమ మొదటి ప్రాధాన్యమని, ఈ విషయంలో రాజీపడే అవకాశమే లేదన్నారు. 
 
దేశంలో అత్యవసర వినియోగానికి కొన్ని వ్యాక్సిన్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని, వాటిని డ్రగ్‌ రెగ్యులేటర్‌ విశ్లేషిస్తున్నారని చెప్పారు. అయితే వ్యాక్సిన్‌ పరిశోధనల విషయంలో భారత్‌ ఏ దేశానికి తీసిపోలేదన్నారు. 
 
టీకా సమర్థత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశంలోని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు స్వదేశీ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నారని, వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో దేశంలో 30 కోట్లమందికి టీకాలు వేసే సామర్థ్యం తమకుంటుందని చెప్పారు. 
 
ప్రస్తుతం మన దేశంలో ఆరు కరోనా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని చెప్పారు. అందులో కొవీషీల్డ్‌, కోవాక్సిన్‌, జింకోవిడ్‌, స్పుత్నిక్‌ వీ, ఎన్‌వీఎక్స్‌-కోవ్‌2373 టీకాల పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments