ఆత్మహత్యల్లో డ్రాగన్ కంట్రీని అధికమించిన భారత్

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (10:14 IST)
మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఇతర కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య దేశంలో నానాటికీ పెరిగిపోతోంది. ఈ ఆత్మహత్యల్లో డ్రాగన్ కంట్రీని భారత్ అధికమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య బీహార్ కంటే అధికంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
ఏపీ కంటే తెలంగాణాలోనే అధికంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో 15.3 శాతం సూసైడ్ చేసుకుంటుండగా, తెలంగాణాలో ఈ సంఖ్య 26.9 శాతంగా ఉంది. అయితే, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యా కేసుల్లో 33.2 శాతం బలవన్మరణాలకు కుటుంబ సమస్యలే ప్రధాన కారణమని జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) పేర్కొంది. ఈ విషయం హైదరాబాద్ నగరంలో జరిగిన 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రి సదస్సులో పాల్గొన్న నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ప్రతి యేడాది దేశ వ్యాప్తంగా 1.63 లక్షల మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే, వాస్తవ సంఖ్య మాత్రం 1.90 లక్షలకు పైమాటగానే వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కానీ గ్లోబర్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ మాత్రం ఈ సంఖ్య 2.30 లక్షలుగా ఉంటుందని తెలిపింది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలేనని తేలింది. 
 
ప్రమాదకరమైన టీబీ, కేన్సర్ ‌కంటే ఆత్మహత్యల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారని ఎన్.సి.ఆర్.బి. తెలిపింది. అయితే, అన్ని రంగాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్ రాష్ట్రంలో మాత్రం అతి తక్కువ సంఖ్య అంటే 0.70 శాతం మంది బలవన్మరణాలకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments