Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు లడఖ్‌లో సర్వసన్నద్ధంగా ఇండియన్ వైమానికి దళం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:54 IST)
తూర్పు లడఖ్‌ ప్రాంతంలో భారత వైమానికదళం సర్వ సన్నద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు గత నెల 15వ తేదీన భారత సైనికులపై దొంగచాటుగా దాడి చేసి 20 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 
 
ఈ సరిహద్దు ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం సర్వ సన్నద్ధమైంది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాఫ్టర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగనతలంలో కాపలాగా ఉంచుతోంది. 
 
రవాణాకు వినియోగించే అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 లాంటి వాటిల్లో దళాలను, సామాగ్రిని రవాణా చేయడానికి ఇప్పటికే వాయుసేన మోహరించింది. అపాచీ యుద్ధం విమానమైతే నిరంతరం గస్తీ కాస్తూనే ఉంది. 
 
ఈ స్థావరం మొత్తం కూడా కార్యకలాపాలను పర్యవేక్షించడం, జవాన్ల సంసిద్ధతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. 'ఈ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ స్థావరం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ స్థావరం ఎలాంటి ఆకస్మిక చర్యలను చేపట్టడానికైనా, పోరాటం చేయడానికైనా సర్వ సన్నద్ధంగా ఉంది' అని ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments