Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు లడఖ్‌లో సర్వసన్నద్ధంగా ఇండియన్ వైమానికి దళం

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (15:54 IST)
తూర్పు లడఖ్‌ ప్రాంతంలో భారత వైమానికదళం సర్వ సన్నద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలోని గాల్వాన్ లోయలో చైనా బలగాలు గత నెల 15వ తేదీన భారత సైనికులపై దొంగచాటుగా దాడి చేసి 20 మందిని చంపేసిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 
 
ఈ సరిహద్దు ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం సర్వ సన్నద్ధమైంది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాఫ్టర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగనతలంలో కాపలాగా ఉంచుతోంది. 
 
రవాణాకు వినియోగించే అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 లాంటి వాటిల్లో దళాలను, సామాగ్రిని రవాణా చేయడానికి ఇప్పటికే వాయుసేన మోహరించింది. అపాచీ యుద్ధం విమానమైతే నిరంతరం గస్తీ కాస్తూనే ఉంది. 
 
ఈ స్థావరం మొత్తం కూడా కార్యకలాపాలను పర్యవేక్షించడం, జవాన్ల సంసిద్ధతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. 'ఈ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ స్థావరం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ స్థావరం ఎలాంటి ఆకస్మిక చర్యలను చేపట్టడానికైనా, పోరాటం చేయడానికైనా సర్వ సన్నద్ధంగా ఉంది' అని ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments