ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన భారత వైమానిక దళం...?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (07:44 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర తండాలపై భారత వైమానిక దళం మరోమారు విరుచుకుపడినట్టు సమాచారం. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో ఈ దాడులు నిర్వహించిందని ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ పీటీఐని ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్‌లను ప్రసారం చేస్తున్నాయి. 
 
భారత వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులు కూడా హతమయ్యారని, 20 మందికి పైగా గాయపడ్డారని జాతీయ మీడియా ప్రకటించింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు సిద్ధమౌతుండగా వైమానిక దాడులు జరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి. 
 
అయితే ఎల్‌ఓసీ వద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లుగా జాతీయ మీడియా ఛానెళ్లలో ప్రసారమౌతున్న కథనాల్లో నిజం లేదని భారత ఆర్మీకి చెందిన లెఫ్టెనెంట్ జనరల్ పరమ్‌జిత్ స్పష్టం చేశారు. కాగా, గతంలో కూడా భారత వైమానిక దళం ఇదే తరహా మెరుపు దాడులు జరిపిన విషయం తెల్సిందే. ఈ దాడులతో ప్రపంచం యావత్ విస్తుపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments