ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన భారత వైమానిక దళం...?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (07:44 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర తండాలపై భారత వైమానిక దళం మరోమారు విరుచుకుపడినట్టు సమాచారం. సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో ఈ దాడులు నిర్వహించిందని ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ పీటీఐని ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్‌లను ప్రసారం చేస్తున్నాయి. 
 
భారత వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులు కూడా హతమయ్యారని, 20 మందికి పైగా గాయపడ్డారని జాతీయ మీడియా ప్రకటించింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు సిద్ధమౌతుండగా వైమానిక దాడులు జరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి. 
 
అయితే ఎల్‌ఓసీ వద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లుగా జాతీయ మీడియా ఛానెళ్లలో ప్రసారమౌతున్న కథనాల్లో నిజం లేదని భారత ఆర్మీకి చెందిన లెఫ్టెనెంట్ జనరల్ పరమ్‌జిత్ స్పష్టం చేశారు. కాగా, గతంలో కూడా భారత వైమానిక దళం ఇదే తరహా మెరుపు దాడులు జరిపిన విషయం తెల్సిందే. ఈ దాడులతో ప్రపంచం యావత్ విస్తుపోయింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments