Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ నాపై కుట్రలు పన్నుతున్నారు

ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (18:24 IST)
ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డితో పాటు అతని బంధువుల ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. 
 
కానీ తన ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని మాత్రం ఆపలేదు. తన నియోజకవర్గంలో ప్రచారాన్ని యదావిధిగా కొనసాగించారు. ప్రచారం తర్వాతే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనైయ్యారు. 
 
గతంలో తన కుమార్తె లగ్న పత్రిక రాసుకునే రోజునే తనను అరెస్ట్ చేసి మానసికంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమో ఇలా ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరిపి దెబ్బతీయాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఢిల్లీలోని మోదీ, తెలంగాణలోని కేడీ (కేసీఆర్) ఇద్దరు కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారన్నారు. అయినప్పటికీ తాను భయపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments