Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవులు - ఆంబోతులు ఒక్కటయ్యాయి.. మంగళవాయిద్యాలు.. వేదమంత్రాల మధ్య...

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవుల

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:57 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో ఆవులు, ఆంబోతులకు పెళ్లి జరిపించారు. మంగళవాయిద్యాల నడుమ వందలాది మంది నృత్యం చేస్తుండగా ఈ వివాహ ఘట్టాన్ని వేదమంత్రాల మధ్య పూజారులు పూర్తి చేశారు. దీంతో మొత్తం 40 ఆవులు, ఆంబోతులు ఒక్కటయ్యాయి. ఎంతో వైభవంగా సాగిన ఈ ఆవుల వివాహాలకు అతిధులుగా షిల్లాంగ్, మేఘాలయ, ముంబై, ఢిల్లీ, చంఢీఘడ్ ప్రాంతాలనుంచే కాకుండా చుట్టుపక్కల పదిగ్రామాల ప్రజలు తరలివచ్చారు. 
 
అతిథుల కోసం ప్రత్యేకంగా 200 కాటేజీలను ప్రత్యేకంగా నిర్మించారు. ఈ గోవుల వివాహ మహోత్సవానికి వచ్చిన వారినుంచి అందిన రూ.25 లక్షల విరాళాలతో ఆవుల షెల్టర్లను అభివృద్ధి చేస్తామని రాజేంద్రదాస్ అనే నిర్వాహకుడు చెప్పారు. ఈ పెళ్లి కోసం 40 ఎద్దులను ప్రత్యేకంగా పాత్ మేద గోశాల నుంచి రప్పించామని మరో నిర్వాహకుడు గోపేష్ చెప్పారు. హిందూమతంలో ఆవులకున్న విశిష్టతను గుర్తించి దేశవాళీ ఆవులు గర్భం దాల్చేందుకు వీలుగా ఎద్దులను తీసుకువచ్చి వివాహతంతు జరిపించామని నిర్వాహకులు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments