Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కారణాలతో బాధపడేవారు లోకం విడిచి వెళ్లొచ్చు : సుప్రీంకోర్టు

కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ లోకాన్ని త్వరగా విడిచి వెళ్లాలని భావించడం తప్పేమీ కాదని కూడా ఐదుగురు న్యాయమూర్తులతో కూ

Webdunia
శుక్రవారం, 9 మార్చి 2018 (12:24 IST)
కారుణ్య మరణాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక రూలింగ్ ఇచ్చింది. ఎప్పటికీ నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఈ లోకాన్ని త్వరగా విడిచి వెళ్లాలని భావించడం తప్పేమీ కాదని కూడా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. 
 
స్వచ్ఛంద మరణంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం అందుకు అనుమతించింది. నిజానికి ఈ పిటిషన్‌పై గతేడాది అక్టోబరు 11నే వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. తాజాగా శుక్రవారం దీనిపై తీర్పును వెల్లడించింది. అలాగే, స్వచ్ఛంద మరణంపై నియమ నిబంధనలను కేంద్రం తయారు చేసి, న్యాయస్థానానికి అందజేసింది. వీటిని పరిశీలించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది. 
 
విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక మరణించాలని భావించే వారికి వారు కోరిన అవకాశాన్ని దగ్గర చేయాలంటూ కీలక రూలింగ్ ఇచ్చింది. బతికేందుకు ఎటువంటి మార్గమూ లేదని అన్ని విధాలుగా తేలిపోయిన తర్వాత, స్వచ్ఛంద మరణాన్ని కోరుకునే హక్కు న్యాయమైన హక్కేనని పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. పౌరులకు గౌరవంగా మరణించే హక్కు ఉందని అభిప్రాయపడ్డ న్యాయమూర్తులు, విధివిధానాలకు తగ్గట్టుగా వారు తమ కోరికను తీర్చుకోవచ్చని స్పష్టంచేశారు. 
 
అయితే అందుకు సదరు రోగుల కుటుంబసభ్యుల నుంచి అనుమతి ఉండాలని పేర్కొంది. వీరితో పాటు ఆ రోగి కోలుకోవడం సాధ్యం కాదని చెప్పిన వైద్యుల బృందం అనుమతి కూడా ఉండాలని సూచించింది. సజీవ వీలునామాను తీసుకుని రోగి కుటుంబసభ్యులు లేదా సన్నిహితులు హైకోర్టుకు వెళితే.. పరోక్ష కారుణ్యం అవసరమో లేదో నిర్ణయించేందుకు ఆ న్యాయస్థానం మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీర్పును వెలువరిస్తూ.. అలాంటి రోగులకు గౌరవంగా చనిపోయే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments