Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా- ఎఫ్‌బీలో ఎవరు ఎవరిని బెదిరించారు?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. తన నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానని కాంగ్రెస్ ఎంపీని బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగడం ప్రస్తుతం చర్చనీ

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (13:14 IST)
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య రాజకీయ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. తన నియోజకవర్గంలోకి అడుగుపెడితే చంపేస్తానని కాంగ్రెస్ ఎంపీని బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులకు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి హట్టా జిల్లాలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 
 
కానీ అయితే హట్టా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్‌ కుమారుడు ప్రిన్స్‌దీప్‌ లాల్‌చంద్‌ ఖటిక్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు ఫేస్ బుక్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియా ''ఎవరైతే ఝాన్సీ రాణిని చంపారో వారి రక్తం నీలో ప్రవహిస్తోంది. ఒక వేళ నువ్వు హట్టాలో అడుగుపెడితే నిన్ను నేను చంపేస్తా'' అంటూ హెచ్చరించాడు. 
 
ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. కానీ ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరమని.. సింధియా గౌరవించదగిన ఎంపీ అని.. ఆ పోస్ట్‌ను తొలగించమని తన కుమారుడికి చెబుతానని ఎమ్మెల్యే ఉమాదేవి ఖటిక్ తెలిపారు. 
 
మరోవైపు సింధియాకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఆ రాష్ట్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రాజా పటేరియా ఆరోపించారు. ఇలాంటి పోస్టులను తీవ్రంగా పరిగణించి తక్షణమే విచారణ చేపట్టాలని, సింధియాకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments