Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రాణి ముఖర్జీయాతో కార్తీ చిదంబరం లింకు.... ఎలాంటి సంబంధమంటే?

కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబ

Webdunia
బుధవారం, 17 మే 2017 (15:27 IST)
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం నివాసంపై సీబీఐ సోదాలు జరిపిన తర్వాత ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జీయా భార్య ఇంద్రాణి ముఖర్జీయాతో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 
 
చిదంబరంతో ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ మంగళవారం ఉదయం తనిఖీలు జరిపిన విషయం తెల్సిందే. ఓ మీడియా కంపెనీకి విదేశీ పెట్టుబడుల అనుమతుల మంజూరుకు సంబంధించిన వ్యవహారంలో కార్తీ చిదంబరం నిందితుడని ఎఫ్ఐఆర్ దాఖలైంది. 
 
కార్తీకి చెందిన సంస్థ 2008లో ఐ.ఎన్.ఎక్స్ మీడియా కంపెనీకి క్లియరెన్సులు అందడానికి అనువుగా వ్యవహరించిందన్నది ఆరోపణ. ఆ సమయంలో కార్తీ సంస్థ ఈ ఐ.ఎన్.ఎక్స్ మీడియా నుంచి రూ.10 లక్షల ముడుపులు అందుకున్నట్టు సమాచారం. 
 
ఈ కంపెనీ ఇంద్రాణీ ముఖర్జియా భర్త మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాకు చెందినది కావడం గమనార్హం. దీంతో ఇంద్రాణీతో కార్తీ చిదంబరం ఆర్థిక సంబంధాలు నెరిపినట్టు సమాచారం. ఈ డీల్ పూర్తి చేసేందుకు కార్తీ చిదంబరం భారీ మొత్తంలోనే ముడుపులు స్వీకరించినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments