చివరిసారిగా ''అప్పా'' అని పిలిచేనా? తండ్రికి స్టాలిన్ భావోద్వేగ కవిత..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణవార్త తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎంకే కార్యకర్తలను శోకసంద్రంలో ముంచేసింది. ఇక కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌కు తీవ్ర ఆవేద

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (09:16 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణవార్త తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎంకే కార్యకర్తలను శోకసంద్రంలో ముంచేసింది. ఇక కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌కు తీవ్ర ఆవేదనకు దారితీసింది. తన తండ్రి ఇక లేరనే వార్త ఆయన్ని విషాదంలో ముంచింది. చివరిసారిగా తన తండ్రి కోసం స్టాలిన్ రాసిన కవిత తమిళ ప్రజల కంట నీరు తెచ్చేలా చేసింది. 
 
కరుణానిధిని అప్పా (నాన్నా) అని పిలచేకంటే.. లీడర్‌ అని పిలవడమే తనకిష్టమని ట్వీట్టర్లో స్టాలిన్ పేర్కొన్నారు. తన జీవితాంతం.. కరుణానిధిని లీడర్‌గానే కొలుస్తానని అన్నారు. అయినా చివరిసారిగా అప్పా అని పిలవనా అంటూ స్టాలిన్‌ చేసిన ట్వీట్ పుత్ర వాత్సల్యానికి నిదర్శనంగా నిలిచింది.
 
ఇంతకాలం మిమ్మల్ని అప్పా అని కాకుండా తలైవరే అనే ఎక్కువసార్లు పిలిచాను. చివరిసారిగా ఒక్కసారి మిమ్మల్ని అప్పా అని పిలవచ్చా తలైవరే. తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు. 
 
కానీ ఈ సారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? ఒక్కసారి నా ప్రియమైన సోదరులారా.. అని మమ్మల్ని పిలవండి. ఆ పలుకే మరో శతాబ్దం వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి.. అంటూ స్టాలిన్ రాసిన కవిత డీఎంకే కార్యకర్తలు, నేతలు, ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments