Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పులిని చంపేయండి... కేరళ సర్కారు ఆదేశం!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (08:50 IST)
ఓ మహిళపై దాడి చేసి చంపి ఆరగించిన పులిని చంపేయాలంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేరళ రాష్ట్రలోని వయనాడ్‌లోని మనంతాడి సమీపంలో కాఫీ తోటలో పని చేస్తున్న 45 యేళ్ల రాధ అనే మహిళపై ఓ పులి ఇటీవల దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని కొంత భాగాన్ని ఆహారంగా తీసుకుంది. 
 
పిమ్మట అటవీశాఖ అధికారి జయసూర్యపై కూడా దాడి చేసి గాయపరిచింది. ఈ వరుస దాడులతో ఆ ప్రాంత వాసులు ప్రాణభయంతో వణికిపోతూ, కాఫీ తోటల్లో పని చేసేందుకు వెళ్లడం లేదు. పైగా, ఆ పులి ఎపుడు ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వణికిపోతూ బిక్కుబిక్కుమటూ గడుపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించి, తక్షణం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశించార. కాగా, కేరళ రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments