Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోని పిల్లల్లో ఇమ్యూనిటీ భేష్‌: ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (20:38 IST)
దేశవ్యాప్తంగా పాఠశాలలను దశలవారీగా తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సూచించారు. మన దేశంలోని పిల్లల్లో రోగ నిరోధక శక్తి బాగుందని చెప్పారు.

కరోనా కట్టడికి గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటి నుంచి వర్చువల్‌ విధానంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో విడుతలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నది.

ఈ నేపథ్యంలో పాఠశాలలు తిరిగి తెరిచే సమయం వచ్చిందని గులేరియా అన్నారు. వైరస్‌ వ్యాప్తి తక్కువగా (పాజిటివిటీ రేటు 5 శాతంలోపు) ఉన్న జిల్లాల్లో దశలవారీగా పాఠశాలలను పునఃప్రారంభించాలని చెప్పారు.

పిల్లల్ని రోజు విడిచి రోజు పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వైరస్‌ తీవ్రత మళ్లీ పెరిగితే, పాఠశాలలను వెంటనే మూసివేయవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments