Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సన్యాసినయ్యేందుకు వెళ్తున్నా... వెతకొద్దు... ఐఐటి మద్రాసు విద్యార్థిని(గుంటూరు) లేఖ షాక్

Webdunia
బుధవారం, 20 జనవరి 2016 (17:30 IST)
మేధావులుగా మంచి టాప్ ర్యాంకులు సాధిస్తున్న విద్యార్థినీవిద్యార్థులు ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడికి గురై గబుక్కున ఓ నిర్ణయం తీసేసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు తమ తల్లిదండ్రులకు ఎంతటి ఆవేదనకు గురి చేస్తాయో ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. వారేమి అనుకుంటారో అదే చేసేస్తున్నారు. తాజాగా మద్రాస్ ఐఐటీలో జరిగిన ఘటన మిస్టరీగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు చెందిన 26 ఏళ్ల వేదాంతం ఎల్.ప్రత్యూష ఐఐటి మద్రాస్‌లో ఇంజినీరింగ్ డిజైన్లో ఎమ్ఎస్ చేస్తోంది. మరి చదువు తెచ్చిన ఒత్తిడో ఏమోగానీ ఆమె ఓ నిర్ణయం తీసేసుకుంది. తనకు సన్యాసిని కావాలన్న ఆకాంక్ష బలపడిపోయిందనీ, అందువల్ల హిమాలయాలకు వెళుతున్నట్లు తను ఉంటున్న హాస్టల్ గదిలో ఒక లేఖను రాసి పెట్టి వెళ్లిపోయింది.
 
తనకెందుకో ఈమధ్య ఆధ్యాత్మిక జీవనం పైన విపరీతమైన ప్రేమ ఏర్పడిందనీ, అందువల్ల హిమాలయాలకు వెళ్లిపోతున్నట్లు ఆ లేఖలో తెలిపింది. గత ఆదివారం నాడు ఆమె హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. తన కుటుంబ సభ్యుల సహా ఎవరూ తనకోసం వెతకవద్దనీ, ఒకవేళ వెతికినా తను కనబడనని పేర్కొంది. 
 
ఐతే ఆమె ఇప్పటివరకూ ఎక్కడికి వెళ్లిందో తెలియరాక, గుంటూరులో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఆమె నిజంగానే హిమాలయాలకు వెళ్లిందా... లేదంటే ఏమయినా అనుకోని సంఘటన జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments