Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ కు ఫోన్ చేయాలంటే.. ల్యాండ్ లైన్ లో జీరో నొక్కాల్సిందే

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (14:15 IST)
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులంతా  ల్యాండ్‌లైన్ నుంచి ఏ మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలన్నా ముందుగా ‘జీరో’ నొక్కాల్సివుంటుంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) గత నవంబరులో ల్యాండ్ లైన్ వినియోగదారులు ఏ మొబైల్ నంబరుకు ఫోను చేయాలన్నా ముందుగా సున్నా నంబరు నొక్కాలని తెలిపింది. ఈ విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. టెలికం ఆపరేటర్స్ తమ వినియోగదారులకు ఈ సమాచారాన్ని తెలియజేసేందుకు అన్నిఏర్పాట్లు చేశాయి. 
 
ఎయిర్‌టెల్ తన ఫిక్స్‌డ్ లైన్ యూజర్స్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ... డాట్ ఆదేశాలను అనుసరించి 2021, జనవరి 15 నుంచి ఏ ల్యాండ్‌లైన్ నుంచి అయినా మొబైల్‌కు పోన్ చేయాలంటే ముందుగా జీరో ప్రెస్ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

ఇదేవిధంగా జియో కూడా తన ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ యూ‌జర్స్‌కు దీనికి సంబంధించిన మెసేజ్ పంపించింది. కాగా ఈ విధానం కేవలం ల్యాండ్ లైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయాల్సివచ్చిన్పుడు ఈ విధానం అనుసరించాల్సిన అవసరం లేదు.

డాట్ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేందుకు తీసుకువచ్చిన ఈ విధానం వలన మొబైల్ సర్వీసెస్ కోసం టెలికం కంపెనీలకు వీలైనంత అత్యధిక నంబర్లు రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments