Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ కు ఫోన్ చేయాలంటే.. ల్యాండ్ లైన్ లో జీరో నొక్కాల్సిందే

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (14:15 IST)
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులంతా  ల్యాండ్‌లైన్ నుంచి ఏ మొబైల్ నంబరుకు ఫోన్ చేయాలన్నా ముందుగా ‘జీరో’ నొక్కాల్సివుంటుంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డాట్) గత నవంబరులో ల్యాండ్ లైన్ వినియోగదారులు ఏ మొబైల్ నంబరుకు ఫోను చేయాలన్నా ముందుగా సున్నా నంబరు నొక్కాలని తెలిపింది. ఈ విధానం ఈరోజు నుంచి అమలులోకి వచ్చింది. టెలికం ఆపరేటర్స్ తమ వినియోగదారులకు ఈ సమాచారాన్ని తెలియజేసేందుకు అన్నిఏర్పాట్లు చేశాయి. 
 
ఎయిర్‌టెల్ తన ఫిక్స్‌డ్ లైన్ యూజర్స్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ... డాట్ ఆదేశాలను అనుసరించి 2021, జనవరి 15 నుంచి ఏ ల్యాండ్‌లైన్ నుంచి అయినా మొబైల్‌కు పోన్ చేయాలంటే ముందుగా జీరో ప్రెస్ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

ఇదేవిధంగా జియో కూడా తన ఫిక్స్‌డ్ ల్యాండ్ లైన్ యూ‌జర్స్‌కు దీనికి సంబంధించిన మెసేజ్ పంపించింది. కాగా ఈ విధానం కేవలం ల్యాండ్ లైన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయాల్సివచ్చిన్పుడు ఈ విధానం అనుసరించాల్సిన అవసరం లేదు.

డాట్ తెలిపిన వివరాల ప్రకారం ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేందుకు తీసుకువచ్చిన ఈ విధానం వలన మొబైల్ సర్వీసెస్ కోసం టెలికం కంపెనీలకు వీలైనంత అత్యధిక నంబర్లు రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments