Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధ్వీ ప్రాచీ వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలి..

హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌, నిఖాహలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేప

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (18:22 IST)
హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌, నిఖాహలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇలాంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్‌ (బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
అంతేగాకుండా.. విశ్వ హిందూ పరిషత్‌ నేత సాధ్వీ ప్రాచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్‌ దేవాలయాన్ని దర్శించుకున్న సాధ్వి ప్రాచి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చురకలంటించారు. ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి పెళ్లి కావాలని దేవుడి వద్ద కోరుకున్నానన్నారు. 
 
బాబా గోరఖ్‌నాథ్‌ ఆశీస్సుల కోసం ఇక్కడకొచ్చానని.. కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజార్టీని సాధించలేకపోతే, కనీసం రాహుల్‌ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నానని సాధ్వి సెటైర్లు విసిరారు.
 
కాగా సాధ్వీ ప్రాచి చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ''కాంగ్రెస్‌ నేతలపై వ్యాఖ్యలు చేయడం ఇటీవల సర్వసాధారణంగా మారిందని, సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయి ఏమిటో తెలియజేస్తోందని అశోక్ సింగ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

Mahesh Babu: రేపటి నుంచి ఒరిస్సా లో రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా షూటింగ్‌ - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

తర్వాతి కథనం
Show comments