Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు బలవంతంగా క్రీడాకారుల గెంటివేత.. ఐఏఎస్ ఉద్యోగం ఊడింది...

rinku dugga
Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (08:32 IST)
తమ పెంపుడు కుక్కతో క్రీడా మైదానంలో వాకింగ్ చేసేందుకు ఆ స్టేడియంలోని క్రీడాకారులను బలవంతంగా బయటకు పంపించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారిణితో బలవంతంగా రాజీనామా చేయించింది. ఆమె పేరు రింకూ దుగ్గా. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా క్రీడాకారులను ముందుగానే పంపించివేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఈ స్టేడియం సాయంత్రం ఏడు గంటల వరకూ క్రీడాకారులకు అందుబాటులో ఉండాలి. 
 
ఈ క్రమంలో, పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు రింకూ, ఆమె భర్త ఈ మైదానాన్ని వాడుకోవడం ప్రారంభించారు. ఈ జంట ఆదేశాల మేరకు నిర్వాహకులు నిర్ణీత సమయానికంటే ముందే క్రీడాకారులను బయటకు పంపించసాగారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
దీనిపై కేంద్రం కన్నెర్ర జేసింది. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగినైనా ముందస్తుగా పదవీ విరమణ చేయమని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంది. దీంతో రింకూ తన ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ లద్దాక్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments