Webdunia - Bharat's app for daily news and videos

Install App

భరత గడ్డపై అడుగుపెట్టనున్న అభినందన్... వాఘా బోర్డర్‌ వద్ద భావోద్వేగ వాతావరణం

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (09:49 IST)
భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంబడించి, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసిన తర్వాత ప్రమాదశాత్తు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో దిగిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భరతమాత గడ్డపై  అడుగుపెట్టనున్నాడు. 
 
తమ వద్ద బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేసేందుకు పాకిస్థాన్ గురువారం సమ్మతించిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో పాటు.. భారత దౌత్య నీతికి పాకిస్థాన్ తలొగ్గక తప్పలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన ఈ ప్రకటనతో భారతదేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
 
మరోవైపు, అభినందన్ భార్యాపిల్లలు ఢిల్లీలో ఉంటే.. ఆయన తల్లిదండ్రులు మాత్రం చెన్నై తాంబరం ఎయిర్‌ఫోర్స్ క్వార్టర్స్‌లో నివశిస్తోంది. దీంతో తమ బిడ్డను చూసేందుకు అభినందన్ తండ్రి సింహుకుట్టి వర్ధమాన్, తల్లి శోభలు, మరికొంతమంది బంధువులు గురువారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments