అభినందన్ ప్యారాచూట్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది: ఆర్మీ

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (19:24 IST)
భారత్-పాకిస్థాన్‌ సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ అధికారులు ఢిల్లీలో గురువారం మీడియా ముందు ప్రకటన చేశారు. కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుందని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. రెచ్చగొడితే బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా వున్నామని, అలాగే శాంతి చర్చలకు కట్టుబడి వున్నామని వారు ప్రకటించారు. 
 
సమాచారాన్ని వక్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. తాము రెండు పాక్ విమానాలను కూలిస్తే పైలట్లు సురక్షితంగా దిగారు. భారత్ భూభాగంలోకి పాకిస్థాన్ విమానాలు ప్రవేశించాయి. 
 
భారత మిలటరీ స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ విమానాలు వచ్చాయని.. మన యుద్ధ విమానాలు వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాయని త్రివిధ దళాల అధికారులు ప్రకటించారు. అభినందన్ ప్యారాచూట్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పడింది. అభినందన్‌ను అలా వారు అదుపులోకి తీసుకున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments