Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్

‘వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని

Webdunia
బుధవారం, 2 మే 2018 (21:17 IST)
వింత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే  త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే గోళ్లు కత్తిరించేస్తానంటూ షాకింగ్  కామెంట్స్ చేశారు. పోలీస్ దినోత్సవం సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తలాలో నిర్వహించిన కార్యక్రమంలో బిప్లబ్‌ మాట్లాడుతూ.. ‘ఎవ్వరూ నా ప్రభుత్వంపై చెయ్యి వేయలేరు. ఎందుకంటే  ప్రభుత్వం నాది కాదు. ప్రజలది. 
 
నా ప్రజలు, ప్రభుత్వంపై చెయ్యి ఎత్తే ధైర్యం చేస్తే గోళ్లు కత్తిరించేస్తా’ అని వ్యాఖ్యానించారు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వద్ద సొరకాయలు ఉంటే కొనడానికి వచ్చేవారంతా అది బాగానే ఉందా? లేదా? అని పరీక్షించేందుకు గోళ్లతో గిల్లి చూస్తారు. అలా చాలామంది చేయడం వల్ల సొరకాయపై గాట్లు పడి ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఇక దాన్ని ఎవ్వరూ కొనుక్కోరు. సొరకాయ మాదిరిగా నా ప్రభుత్వంపై ఎవ్వరైనా గాట్లు పెడదామని చూస్తే... చూస్తూ ఊరుకోను. వాళ్ల  గోళ్లు కత్తిరించేస్తాను’ అంటూ మరో వివాదంలో ఇరుక్కున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments