Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం స్కామ్‌ను హైలైట్ చేసేందుకు ఢిల్లీకి వచ్చాను.. వైఎస్ షర్మిల

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (15:57 IST)
YS Sharmila
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ చేపట్టారు. ఈ సందర్భంగా హస్తినలో షర్మిల మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని హైలైట్ చేయడానికి తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుంభకోణం చాలా పెద్దదని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖజానాకు ఖర్చయ్యే డబ్బు రూ1.2 లక్షల కోట్ల మొత్తం చేరిందన్నారు. ఈ ప్రాజెక్టు కింద స్కామ్ జరిగిందని.. కేసీఆర్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. 
 
ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆస్తులు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులతో సమావేశమై ఫిర్యాదు చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments