కాళేశ్వరం స్కామ్‌ను హైలైట్ చేసేందుకు ఢిల్లీకి వచ్చాను.. వైఎస్ షర్మిల

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (15:57 IST)
YS Sharmila
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ చేపట్టారు. ఈ సందర్భంగా హస్తినలో షర్మిల మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని హైలైట్ చేయడానికి తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుంభకోణం చాలా పెద్దదని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖజానాకు ఖర్చయ్యే డబ్బు రూ1.2 లక్షల కోట్ల మొత్తం చేరిందన్నారు. ఈ ప్రాజెక్టు కింద స్కామ్ జరిగిందని.. కేసీఆర్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. 
 
ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆస్తులు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులతో సమావేశమై ఫిర్యాదు చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments