Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లడబ్బు చెత్తను ఊడ్చేస్తా.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తా : నరేంద్ర మోడీ

నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటన

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (07:51 IST)
నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటనపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. 
 
అవినీతి భారతాన్ని ఆవిష్కరించేందుకు తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి ఊగిసలాట నిర్ణయాలూ ఉండవని తేల్చి చెప్పారు. ‘‘దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు. 
 
అయితే, ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించారని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు చాలా ఓపికతో సహనంతో పాత నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకుంటున్నారు. వారి స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments