Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బైపోల్ : 172 పోలింగ్‌ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌..

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (09:45 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. నియోజకవర్గంలోని 306 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 22 రౌండ్లలో ఓట్లు లెక్కించగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ రావుకు కేవలం 3,012 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 
 
గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60,604 ఓట్లు పోలవ్వగా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం ఐదు శాతానికి మించలేదు. ఏకంగా 172 పోలింగ్‌ కేంద్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 134 పోలింగ్‌ కేంద్రాల్లో 10 కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 71, 72, 107, 281 పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. 
 
కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయడం, చివరకు స్థానికేతరుడైన బల్మూరి వెంకటనర్సింగరావును బరిలో దింపటం పార్టీకి ప్రతికూలంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
పైగా భాజపా, తెరాస నేతలు హోరాహోరీగా ప్రచారం చేయగా, అదే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయింది. మొత్తంగా ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస మధ్య నువ్వానేనా అన్నట్లు సాగింది తప్ప కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments