Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బైపోల్ : 172 పోలింగ్‌ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌..

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (09:45 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. నియోజకవర్గంలోని 306 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 22 రౌండ్లలో ఓట్లు లెక్కించగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ రావుకు కేవలం 3,012 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 
 
గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60,604 ఓట్లు పోలవ్వగా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం ఐదు శాతానికి మించలేదు. ఏకంగా 172 పోలింగ్‌ కేంద్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 134 పోలింగ్‌ కేంద్రాల్లో 10 కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 71, 72, 107, 281 పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. 
 
కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయడం, చివరకు స్థానికేతరుడైన బల్మూరి వెంకటనర్సింగరావును బరిలో దింపటం పార్టీకి ప్రతికూలంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
పైగా భాజపా, తెరాస నేతలు హోరాహోరీగా ప్రచారం చేయగా, అదే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయింది. మొత్తంగా ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస మధ్య నువ్వానేనా అన్నట్లు సాగింది తప్ప కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

Naveen Chandra: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నవీన్ చంద్ర షో టైం రాబోతోంది

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments