Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ బైపోల్ : 172 పోలింగ్‌ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు సింగిల్‌ డిజిట్‌..

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (09:45 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూసింది. నియోజకవర్గంలోని 306 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 22 రౌండ్లలో ఓట్లు లెక్కించగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ రావుకు కేవలం 3,012 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 
 
గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60,604 ఓట్లు పోలవ్వగా ఈసారి ఉప ఎన్నికల్లో కేవలం ఐదు శాతానికి మించలేదు. ఏకంగా 172 పోలింగ్‌ కేంద్రాల్లో సింగిల్‌ డిజిట్‌ ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 134 పోలింగ్‌ కేంద్రాల్లో 10 కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి. 71, 72, 107, 281 పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. 
 
కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో ఆలస్యం చేయడం, చివరకు స్థానికేతరుడైన బల్మూరి వెంకటనర్సింగరావును బరిలో దింపటం పార్టీకి ప్రతికూలంగా మారిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
పైగా భాజపా, తెరాస నేతలు హోరాహోరీగా ప్రచారం చేయగా, అదే స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయింది. మొత్తంగా ఉప ఎన్నికల్లో భాజపా, తెరాస మధ్య నువ్వానేనా అన్నట్లు సాగింది తప్ప కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments