Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్తను చంపు, కానీ నా పిల్లాడిని వదిలిపెట్టు ఎందుకంటే...?

మనుషులు ఆధునికంగా మారుతున్న కొద్దీ బంధాలు సన్నగిల్లుతున్నాయి. సర్వకాల సర్వావస్థలలోనూ కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు మంటలలో కలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. గతంలో చాటుమాటు

Webdunia
బుధవారం, 26 జులై 2017 (11:49 IST)
మనుషులు ఆధునికంగా మారుతున్న కొద్దీ బంధాలు సన్నగిల్లుతున్నాయి. సర్వకాల సర్వావస్థలలోనూ కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు మంటలలో కలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. గతంలో చాటుమాటుగా సాగే ఈ వ్యవహారాలను ఇప్పుడు ఎంతో ధైర్యంగా నడుపుతున్నారు. అడ్డుగా భావిస్తే ఎవరినైనా మట్టు పెట్టడానికి వెనుకాడటం లేదు.
 
సరిగ్గా మూడు నెలల క్రితం ఇలాంటి సంఘటనే గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. 35 ఏళ్ల వివేక్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి స్థానిక వార్తాపత్రికలో పని చేసేవారు. అతను ఉద్యోగరీత్యా పొద్దున 4 గంటలకు వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. ఈ క్రమంలో అతని భార్య సుష్మా కామేశ్వర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలని భావించిన సుష్మా తన లవర్‌తో కలిసి పన్నాగం పన్నింది. 
 
ఏప్రిల్ 22వ తేదీ ఉదయం కామేశ్వర్ కొంతమంది అనుచరులతో కలిసి వివేక్ ఇంటిలోకి ప్రవేశించి అతని కాళ్లూ చేతులు కట్టేసి ఇటుకలతో మోది చంపారు. ఆ సమయంలో సుష్మా, ఆరేళ్ల కుమారుడు అక్కడే ఉన్నారు. ఆ బిడ్డను కూడా చంపాలని ప్రయత్నించగా వాడు వివేక్‌కి పుట్టలేదు, నీకే పుట్టాడు అని సుష్మా చెప్పగా ఏమీ చేయకుండా వదిలేసారు. తర్వాత కిరాయి మనుషులు శవాన్ని పారవేయడానికి వెళ్లి పోలీసుల కంటపడి భయంతో శవాన్ని కింద పడేసి పరుగులు తీయగా పోలీసులు వారిని వెంబడించి విచారించినప్పుడు ఈ విషయం బయటపడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments