Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్టినిల్లు దూరంగా ఉందనీ వెళ్లేందుకు నిరాకరించిన వధువు..

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (14:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహం జరిగిన ఏడు గంటల్లోనే నవ వధువు తన నిర్ణయం మార్చుకుంది. వివాహమైన తర్వాత అత్తారిల్లు దూరంగా ఉందని అక్కడకు వెళ్లేందుకు నిరాకరించింది. అప్పగింతలు పూర్తయిన తర్వాత ఏడు గంటల్లోనే వధువు తన మనసు మార్చుకుంది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన యువతికి.. రాజస్థాన్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అప్పగింతలు అయిపోయాక వధూవరులిద్దరూ కలిసి అత్తారింటికి బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ వధువు ఒక్కసారిగా మనసు మార్చుకుంది.
 
'అత్తవారిల్లు చాలా దూరం.. నాకు రాజస్థాన్‌ వెళ్లాలని లేదు.. నేను వారణాసి వెళ్లిపోతా' అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారు ఆపాలంటూ గట్టిగా అరిచింది. దీంతో రోడ్డు పక్కన పెళ్లి వాహనాలు ఆగిపోయాయి. ఆదేసమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలోని సిబ్బంది.. మహరాజ్‌పుర్‌ పోలీసులకు సమాచారం అందించారు.
 
అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. వారిని వివరాలు అడిగారు. తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసి వెళ్తానని వధువు పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను మహిళా పోలీసు సహాయంతో అక్కడకు పంపించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments