Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్టినిల్లు దూరంగా ఉందనీ వెళ్లేందుకు నిరాకరించిన వధువు..

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (14:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహం జరిగిన ఏడు గంటల్లోనే నవ వధువు తన నిర్ణయం మార్చుకుంది. వివాహమైన తర్వాత అత్తారిల్లు దూరంగా ఉందని అక్కడకు వెళ్లేందుకు నిరాకరించింది. అప్పగింతలు పూర్తయిన తర్వాత ఏడు గంటల్లోనే వధువు తన మనసు మార్చుకుంది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన యువతికి.. రాజస్థాన్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అప్పగింతలు అయిపోయాక వధూవరులిద్దరూ కలిసి అత్తారింటికి బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ వధువు ఒక్కసారిగా మనసు మార్చుకుంది.
 
'అత్తవారిల్లు చాలా దూరం.. నాకు రాజస్థాన్‌ వెళ్లాలని లేదు.. నేను వారణాసి వెళ్లిపోతా' అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారు ఆపాలంటూ గట్టిగా అరిచింది. దీంతో రోడ్డు పక్కన పెళ్లి వాహనాలు ఆగిపోయాయి. ఆదేసమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలోని సిబ్బంది.. మహరాజ్‌పుర్‌ పోలీసులకు సమాచారం అందించారు.
 
అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. వారిని వివరాలు అడిగారు. తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసి వెళ్తానని వధువు పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను మహిళా పోలీసు సహాయంతో అక్కడకు పంపించారు.
 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments