Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్టినిల్లు దూరంగా ఉందనీ వెళ్లేందుకు నిరాకరించిన వధువు..

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (14:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. వివాహం జరిగిన ఏడు గంటల్లోనే నవ వధువు తన నిర్ణయం మార్చుకుంది. వివాహమైన తర్వాత అత్తారిల్లు దూరంగా ఉందని అక్కడకు వెళ్లేందుకు నిరాకరించింది. అప్పగింతలు పూర్తయిన తర్వాత ఏడు గంటల్లోనే వధువు తన మనసు మార్చుకుంది.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన యువతికి.. రాజస్థాన్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. అనంతరం ఇద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అప్పగింతలు అయిపోయాక వధూవరులిద్దరూ కలిసి అత్తారింటికి బయలుదేరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ వధువు ఒక్కసారిగా మనసు మార్చుకుంది.
 
'అత్తవారిల్లు చాలా దూరం.. నాకు రాజస్థాన్‌ వెళ్లాలని లేదు.. నేను వారణాసి వెళ్లిపోతా' అంటూ ఏడవడం మొదలు పెట్టింది. కారు ఆపాలంటూ గట్టిగా అరిచింది. దీంతో రోడ్డు పక్కన పెళ్లి వాహనాలు ఆగిపోయాయి. ఆదేసమయంలో ఆ ప్రాంతంలో వధువు ఏడుస్తూ ఉండటాన్ని చూసిన పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలోని సిబ్బంది.. మహరాజ్‌పుర్‌ పోలీసులకు సమాచారం అందించారు.
 
అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. వారిని వివరాలు అడిగారు. తాము అమ్మాయికి పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసి వెళ్తానని వధువు పోలీసులకు చెప్పింది. దీంతో ఆమెను మహిళా పోలీసు సహాయంతో అక్కడకు పంపించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments