Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఓ ప్రశ్న అడిగింది... ముక్కు కొరికిపారేసిన భర్త...

Webdunia
శనివారం, 20 జులై 2019 (15:21 IST)
భార్య ఓ ప్రశ్న అడిగింది. అంతే ఆవేశంతో భర్త ఆమె ముక్కు కొరికిపారేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  గుజరాత్, గోటాసర్ ప్రాంతానికి చెందిన రేష్మా గుల్వానీ (40) ఆ ప్రాంతంలో ఓ షాపులో పనిచేస్తుంది. ఈమె భర్త కైలాష్ కుమార్. ఈ దంపతులను ముగ్గురు సంతానం వున్నారు. కైలాష్ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రేష్మ తన పర్సులో పెట్టిన మూడువేల రూపాయలు కనిపించలేదని భర్తను అడిగింది. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగులాట ఏర్పడింది. దీంతో ఆగ్రహానికి గురైన కైలాష్.. భార్యపై దాడి చేయడంతో పాటు ఆమె ముక్కును కొరికేశాడు. 
 
తీవ్రగాయపడిన రేష్మను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కైలాష్‌ను అరెస్ట్ చేశారు. రేష్మ ముక్కుకు 15 కట్లు పడినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments