Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఓ ప్రశ్న అడిగింది... ముక్కు కొరికిపారేసిన భర్త...

Webdunia
శనివారం, 20 జులై 2019 (15:21 IST)
భార్య ఓ ప్రశ్న అడిగింది. అంతే ఆవేశంతో భర్త ఆమె ముక్కు కొరికిపారేశాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  గుజరాత్, గోటాసర్ ప్రాంతానికి చెందిన రేష్మా గుల్వానీ (40) ఆ ప్రాంతంలో ఓ షాపులో పనిచేస్తుంది. ఈమె భర్త కైలాష్ కుమార్. ఈ దంపతులను ముగ్గురు సంతానం వున్నారు. కైలాష్ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే వున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రేష్మ తన పర్సులో పెట్టిన మూడువేల రూపాయలు కనిపించలేదని భర్తను అడిగింది. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగులాట ఏర్పడింది. దీంతో ఆగ్రహానికి గురైన కైలాష్.. భార్యపై దాడి చేయడంతో పాటు ఆమె ముక్కును కొరికేశాడు. 
 
తీవ్రగాయపడిన రేష్మను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కైలాష్‌ను అరెస్ట్ చేశారు. రేష్మ ముక్కుకు 15 కట్లు పడినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments