Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్ : సోషల్ మీడియాలో ప్రచారం... ఆర్మీ వినతి

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:51 IST)
వాయుసేన మెరుపుదాడుల నేపథ్యంలో భారతదేశమంతటా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిచోటా ప్రజలు స్వీట్లు పంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వాయుసేన పైలెట్లపై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇదేసమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫలానా పైలెట్లు ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్నట్లు ఫోటోలు రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.
 
తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక పైలెట్ ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయం కొన్ని టీవీ ఛానెల్‌లలో కూడా ప్రసారం కావడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగి నేరుగా వెళ్లి వారిని అభినందించాలని భావించారు. అయితే ఆ పైలట్ ఎవరో తెలియనందున కొన్ని మీడియా సంస్థలు హైదరాబాద్‌లోని కేంద్ర రక్షణ శాఖ వర్గాలను సంప్రదించగా తమ వద్ద ఆ సమాచారం లేదని తెలియజేసారు. 
 
ఒకవేళ తమ వద్ద ఆ సమాచారం ఉన్నప్పటికీ కూడా భద్రతా కారణాల రీత్యా వెల్లడించడం కుదరదని స్పష్టం చేసారు. అదేకాకుండా సర్జికల్ స్ట్రైక్స్‌లో పాల్గొన్న ఏకైక మహిళ అంటూ ఒక మహిళా పైలట్ ఫోటోలతో ఉన్న పోస్ట్‌లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని, అటువంటి దాడుల్లో పాల్గొన్న వారి వివరాలు వెల్లడించే ఆస్కారమే లేదని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments