కరోనా వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? (Video)

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (08:33 IST)
వైరస్‌లు.. మన శరీరంలోని కణాలలోకి వెళ్లి వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి. కరోనా వైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు.
 
మనం ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో తాకినపుడు, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఈ వైరస్ మన శరీరంలోకి చొరబడుతుంది.
 
మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి వైరస్ వ్యాపిస్తుంది. వాటిని 'కరోనా వైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. 

అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది. ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.
 
కరోనా వైరస్ సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం- ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులుగా ఉంది.
 
కరోనా వైరస్ వల్ల ఆరంభంలో పొడి దగ్గు వస్తుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.
 
కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.  అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.
 
ఈ లక్షణాలకు.. శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ.. ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.
 
ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే.. వారిలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.
 
అయితే, కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం, జలుబుతోపాటు జ్వరం రావడం వంటి లక్షణాలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. 
 
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? 
ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను కానీ సంప్రదించాలి.

కరోనా వైరస్ సోకిన వారిలో చాలామంది విశ్రాంతి తీసుకుని, పారాసెటమాల్ వంటి మాత్రలు తీసుకుని కోలుకుంటున్నారు. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటేనే ఆసుపత్రిలో వైద్యం అవసరమవుతుంది. 
 
ఊపిరితిత్తులు ఎంతగా దెబ్బతిన్నాయో డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం అందిస్తారు. 
 
అయితే, తీవ్రంగా జబ్బుపడి, మీ రోజువారీ కార్యక్రమాలను కూడా చేసుకోలేక పోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, కొన్ని పదాలకు మించి మాట్లాడలేక పోతుంటే, వాసన, రుచిలను గుర్తించలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్ 104 లేదా మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలి.  

జాగ్రత్తగా ఉంటే ఇంట్లో , కుటుంబ సభ్యులతో!  అజాగ్రత్తగా ఉంటే  ఐసొలేషన్ లో,  ఐసీయూలో!!

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments