Webdunia - Bharat's app for daily news and videos

Install App

1992 ఘర్షణలు పునరావృతం కారాదు : శరద్ పవార్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (15:22 IST)
వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు త్వరలో తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు కోసం దేశం యావత్తూ ఆసక్తితో ఎదురు చూస్తోంది. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 
 
తీర్పు ఎలా ఉన్నా.. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, దానిని బట్టి రామ మందిర నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీని పవార్‌ అభినందించారు. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సంయమనం కోల్పోవద్దని, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర పరిస్థితులు (మత ఘర్షణలు) పునరావృతం కావొద్దని ఆయన కోరారు. 
 
మరోవైపు, అయోధ్య వివాదంపై త్వరలో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముంబై మహానగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముంబైలో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను మొహరించింది. సున్నితమైన ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments