Webdunia - Bharat's app for daily news and videos

Install App

1992 ఘర్షణలు పునరావృతం కారాదు : శరద్ పవార్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (15:22 IST)
వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు త్వరలో తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు కోసం దేశం యావత్తూ ఆసక్తితో ఎదురు చూస్తోంది. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 
 
తీర్పు ఎలా ఉన్నా.. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, దానిని బట్టి రామ మందిర నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీని పవార్‌ అభినందించారు. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సంయమనం కోల్పోవద్దని, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర పరిస్థితులు (మత ఘర్షణలు) పునరావృతం కావొద్దని ఆయన కోరారు. 
 
మరోవైపు, అయోధ్య వివాదంపై త్వరలో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముంబై మహానగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముంబైలో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను మొహరించింది. సున్నితమైన ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments