Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడిని ప్రేమించిన కుమార్తె.. చంపేసిన కన్నతండ్రి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:04 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మనసుకు నచ్చిన యువకుడిని ప్రేమించిన కుమార్తెతో ఆమె ప్రియుడిని కూడా కన్నతండ్రి కర్కశంగా చంపేశాడు. ఈ పరువు హత్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొరేన్ జిల్లా రతన్ బసాయి గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన శివాణి (18) అనే యువతి సమీప గ్రామానికి చెందిన రాధేశ్యామ్ తోమర్ (21) అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తుంది. ఈ విషయం శివాణి తండ్రి రాజ్‌పాల్‌కి తెలిసింది. అంతే.. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా కర్కశంగా చంపేశాడు. మృతదేహాలను ఎవరికీ కనిపించకుండా చంబాల్ నదిలో పడేశాడు. ఆ తర్వాత జూన్ మూడో తేదీన తమ కుమార్తె కనిపించలేదంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. 
 
తండ్రి మాత్రం ఏమీ తెలియనట్టుగా ఉండిపోయాడు. దీంతో అనుమానం వచ్చి ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించాడు. పైగా, మృతదేహాలు పడేసిన ప్రాంతాన్ని కూడా చూపించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments