Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు ఫణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి బహుమతి..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (19:13 IST)
ఇటీవల ముంబై రైల్వే స్టేషనులో ప్లాట్‌ఫామ్ పైనుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ ప‌ట్టాల‌పై ప‌డిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి (పాయింట్స్ మెన్) తన ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డ‌యిన ఆ వీడియో వైర‌ల్ అయిపోయింది. 
 
ఈ ఒక్క సాహసంతో మ‌యూర్ షెల్కె అనే ఆ రైల్వే ఉద్యోగి ఒక్క‌సారిగా నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. రైల్వే ఇప్ప‌టికే అత‌నికి రూ.50 వేలు బ‌హుమ‌తిగా ఇస్తే.. అందులో స‌గం ఆ చిన్నారికే ఇస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌యూర్ మ‌రింత మంది మ‌నుసులు గెలుచుకున్నాడు. 
 
తాజాగా జావా మోటార్‌సైకిల్స్ కోఫౌండ‌ర్ అనుప‌మ్ త‌రేజా అత‌నికి ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ముందుగా మాట ఇచ్చిన‌ట్లే మ‌యూర్‌కు బైక్ ఇచ్చిన‌ట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ టూ బైక్‌ను మ‌యూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ క‌ల‌ర్‌లో ఉన్న ఈ బైక్ ధ‌ర రూ.ల‌క్ష‌న్న‌రకు పైనే కావ‌డం విశేషం. జావా ఫార్టీ టూ బైక్‌ను ఈ మ‌ధ్యే లాంచ్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments