నేను జీవిత చరమాంకంలో ఉన్నా.. సమస్యను పరిష్కరిస్తే మంచిది

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:42 IST)
మాజీ ప్రధాని దేవెగౌడ కేంద్ర వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రైతు ఉద్యమంపై చర్చ సందర్భంగా దేవగౌడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. సిమెంటుతో గోడలు నిర్మించే బదులు ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపితే బాగుంటుంది కదా...'' అంటూ వ్యాఖ్యానించారు. కొందరు దురాక్రమణదారులు చేసిన తప్పుకు రైతులందరినీ బలిపశువులు చేయడం భావ్యం కాదని దేవెగౌడ స్పష్టం చేశారు.
 
''నేను జీవిత చరమాంకంలో ఉన్నా... ఈ సమస్యను ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించాలి. చర్చలకు రైతు సంఘాలను పిలవాలి. ఈ సమస్యకు అవసరమైన పరిష్కారాన్ని మేమూ ఇస్తాం. ఇలా చేస్తే గానీ ఓ సమస్య పరిష్కారం అయ్యేట్లు లేదు. 
 
రైతులను ఇబ్బందిపెడితే, వారిపై కఠిన వైఖరిని అవలంబిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ అలా పరిష్కారం కాదని పేర్కొన్నారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసకు రైతులు ఎంత మాత్రమూ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments