చకచక సాగిపోతున్న పాకిస్థాన్ జాతీయుల వీసాల రద్దు...

ఠాగూర్
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (15:15 IST)
కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, పాక్ జాతీయుల వీసాలను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి తక్షణం వెనక్కి పంపాలని కేంద్ర హోం శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అపుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. 
 
గతంలో భారత్ సార్క్ వీసా పొడగింపు పథకం కింద అనేక మంది పాక్ పౌరులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించింది. ఈ పథకం కింద భారత్‍‌లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వైద్య వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 
 
ఇక పాక్ నుంచి కొత్త దరఖాస్తులుకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో పాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. అదేసమయంలో ఇక్కడ ఉన్న పాక్ జాతీయులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments