Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైజాక్ అలారం నొక్కిన పైలట్... వణికిపోయిన ప్రయాణికులు..

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (08:30 IST)
పైలట్ తప్పిదం వల్ల విమానంలోని ప్రయాణికులతో పాటు.. భద్రతా సిబ్బంది కొన్ని నిమిషాల పాటు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా, విమానం హైజాక్ అయిందన్న అనుమానంతో వారికి ముచ్చెమటలు పోశాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఉన్నట్టుండి హైజాక్ అలారం మోగింది. దీంతో ప్రయాణికులు భయంతో బెంబేలెత్తిపోయారు. అలారం మోగడంతో భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టాయి. 
 
ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందిస్తూ, ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే ఎఫ్.జి.-312 విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. అపుడు సరిగ్గా సమయం 3 గంటల 30 నిమిషాలు. ఆ సమయంలో విమానంలో 124 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా 133మంది ఉన్నారు.
 
కొద్దిసేపట్లో విమానం గాలిలోకి ఎగురుతుందనగా హైజాక్ అలారం మోగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు అప్పటికే విమానాన్ని చుట్టుముట్టాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. 
 
కొద్దిసేపటికి స్పందించిన భద్రతా సిబ్బంది… ప్రమాదం ఏమీలేదని పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments