Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైజాక్ అలారం నొక్కిన పైలట్... వణికిపోయిన ప్రయాణికులు..

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (08:30 IST)
పైలట్ తప్పిదం వల్ల విమానంలోని ప్రయాణికులతో పాటు.. భద్రతా సిబ్బంది కొన్ని నిమిషాల పాటు భయంతో వణికిపోయారు. ముఖ్యంగా, విమానం హైజాక్ అయిందన్న అనుమానంతో వారికి ముచ్చెమటలు పోశాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఉన్నట్టుండి హైజాక్ అలారం మోగింది. దీంతో ప్రయాణికులు భయంతో బెంబేలెత్తిపోయారు. అలారం మోగడంతో భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టాయి. 
 
ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు స్పందిస్తూ, ఢిల్లీ నుంచి కాందహార్‌కు వెళ్లే ఎఫ్.జి.-312 విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. అపుడు సరిగ్గా సమయం 3 గంటల 30 నిమిషాలు. ఆ సమయంలో విమానంలో 124 మంది ప్రయాణికులు, సిబ్బంది సహా 133మంది ఉన్నారు.
 
కొద్దిసేపట్లో విమానం గాలిలోకి ఎగురుతుందనగా హైజాక్ అలారం మోగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా బలగాలు అప్పటికే విమానాన్ని చుట్టుముట్టాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. 
 
కొద్దిసేపటికి స్పందించిన భద్రతా సిబ్బంది… ప్రమాదం ఏమీలేదని పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments