Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసాధారణ తీవ్ర తుఫాను - వచ్చే 12 గంటల్లో అతితీవ్ర రూపం

Webdunia
ఆదివారం, 11 జూన్ 2023 (08:56 IST)
అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను 'బిపోర్‌ జాయ్‌' మరో 12 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి అసాధారణ అతి తీవ్ర తుఫానుగా మారనుందని శనివారం భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది 24 గంటల్లో ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. 
 
వాతావరణశాఖ వివరాల ప్రకారం.. వచ్చే 3 రోజుల్లో ఉత్తర - ఉత్తర - పశ్చిమ దిశగా తుఫాను కదులుతుంది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. 
 
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ తుఫాను గుజరాత్‌ను తాకకపోవచ్చని, కానీ, రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
తుఫాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయి. బలమైన ఈదురు గాలులూ వీస్తాయి. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. 
 
తఫానను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. పోర్‌బందర్‌, గిర్‌, సోమనాథ్‌, వల్సాద్‌లకు జాతీయ విపత్తు దళ బృందాలను అధికారులు పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments