Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట మునిగిన ఐటీ కారిడార్: బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్!

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2015 (09:09 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలో ఐటీ కారిడార్ నీట మునిగింది. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ఐటీ కారిడార్ మొత్తం నీట మునిగింది. ప్రముఖ ఐటీ కంపెనీలు యాక్సెంచర్, ఇన్ఫోసిస్ కార్యాలయాల్లోకి వరద నీరు చేరిపోయింది. దీంతో ఈ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 
 
పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఐటీ కంపెనీలు తమ రోజువారీ కార్యకలాపాలను పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాత్కాలికంగా షిఫ్ట్ చేశాయి. రోజువారీ కార్యకలాపాలతో పాటు చెన్నైలోని సిబ్బందిని కూడా ఐటీ కంపెనీలు బెంగళూరుకు తరలించనున్నట్లు సమాచారం.
 
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెడ్ హిల్స్, చోళవరం, చెంబరంబాక్కం, పూండీ చెరువుల్లో నీటిమట్టం పెరగడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో తాగునీరు.. ఇతరత్రా అత్యావసర సౌకర్యాలు అందక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments